Saturday, April 27, 2024

ఎన్నికల బరిలో ఒంటరిగా సిపిఏం పోటీ

- Advertisement -
- Advertisement -

తెలంగాణ పార్లమెంటరీ ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగాలని సిపిఎం నిర్ణయించింది. ఈమేరకు భువనగిరినుంచి జహంగీర్ కు టికెట్ ఇస్తున్నట్లు ప్రకటించింది. మిగిలిన 16 మంది అభ్యర్థుల జాబితాను వీలైనంత త్వరలో వెల్లడిస్తామని ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వీరయ్య ప్రకటించారు.

అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్న సిపిఐ మాత్రం లోక్ సభ  ఎన్నికల్లోనూ ఈ పొత్తు కొనసాగుతుందని చెబుతోంది. ఇక బిజేపి, కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలు అభ్యర్థుల ఎంపికలో బిజీగా ఉన్నాయి. బిజేపి ఇప్పటికే 15 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News