Sunday, April 28, 2024

ఆ.ప్రలో గర్భిణీలను ఆసుపత్రికి తరలించేందుకు ఏసి వ్యాన్లు

- Advertisement -
- Advertisement -

Free Van service for pregnent women

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లోని గర్భిణీ స్త్రీలు ఇప్పుడు డెలివరీ కోసం ఆసుపత్రులకు చేరుకోవడానికి ఎయిర్ కండిషన్డ్ వాహనాన్ని ఉచితంగా పొందవచ్చు. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం 500 ఎయిర్ కండిషన్డ్ వ్యాన్‌లకు జెండా ఊపి ఈ ఉచిత సర్వీసును  ప్రారంభించారు.

విజయవాడలోని బెంజ్ సర్కిల్‌లో  ‘డాక్టర్ వైఎస్ఆర్ తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్‘  పేరుతో ఈ వాహనాల ప్రారంభోత్సవం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం అందించిన అద్వితీయమైన సేవ ఇది.  ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా తల్లి, శిశువులను ఇంటికి తిరిగి పంపుతుంది. రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన అర్హులైన లబ్ధిదారులకు ఈ కొత్త సౌకర్యం అందుబాటులోకి రానుంది.

Jagan flag offs

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News