Friday, April 19, 2024

శ్రీనివాసరావు పాడె మోసిన మంత్రులు ఇంద్రకరణ్, పువ్వాడ

- Advertisement -
- Advertisement -

 

ఖమ్మం: ఈర్లపూడిలో ఎఫ్ఆర్ఓ శ్రీనివాసరావు అంత్యక్రియలను బుధవారం నిర్వహించారు. ప్రభుత్వ లాంఛనాలతో ఎఫ్ఆర్ఓ శ్రీనివాసరావు అంత్యక్రియలు జరిగాయి. అంత్యక్రియల్లో మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొని శ్రీనివాసరావు పాడె మోసారు. ఎంపి రవిచంద్ర ఎమ్మెల్పీ తాత మధు, ఎమ్మెల్యే రేగా కాంతారావు, అటవీశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శాంతకుమారి, కలెక్టర్లు, ఎస్పీలు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఫారెస్ట్‌ రేంజ్‌ అధికారి శ్రీనివాస రావు హత్య కేసులో ఇప్పటికే ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. హత్యకు ఉపయోగించిన కత్తులను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News