Sunday, April 28, 2024

మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు..

- Advertisement -
- Advertisement -

Fuel Prices hiked again for 6th day

న్యూఢిల్లీ: దేశంలో డీజిల్, పెట్రోల్ ధరలు గతంలో ఎన్నడూ లేని విధంగా గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. తాజాగా మరోసారి పెట్రోల్, డీజిల్‌ ధరలు పెరిగాయి. లీటర్ డీజిల్‌పై 35 పైసలు, పెట్రోల్‌పై 30 పైసలు పెరిగినట్లు ప్రభుత్వ రంగంలోని చమురు కంపెనీలు ఆదివారం ప్రకటించాయి. తాజా పెంపుతో ఢిల్లీలో లీటర్ డీజిల్ ధర రూ.92.82కు చేరుకోగా, పెట్రోల్ ధర రూ. 104.14కు పెరిగింది. ముంబయిలో లీటర్ పెట్రోల్ ధర రూ.110.12కు చేరుకోగా.. డీజిల్ ధర రూ.100.66కు చేరుకుంది. కాగా, తాజా పెంపుతో హైదరాబాద్‌లో పెట్రోల్‌ ధర రూ.31 పైసలు, డీజిల్‌ ధర రూ.38 పైసల చొప్పను అధికమయ్యాయి. దీంతో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.108.33, డీజిల్‌ ధర రూ.101.27కు చేరుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరగడమే తాజా పెంపునకు కారణమని చమురు కంపెనీలు తెలిపాయి.

Fuel Prices hiked again for 6th day

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News