Wednesday, August 6, 2025

‘ఘాటీ-’ వచ్చేది అప్పుడే

- Advertisement -
- Advertisement -

క్వీన్ అనుష్క శెట్టి లీడ్ రోల్‌లో నటిస్తున్న యాక్షన్ డ్రామా ఘాటీ సెప్టెంబర్ 5న థియేటర్లలో విడుదలకు కానున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. గ్రిప్పింగ్ థియేట్రికల్ ట్రైలర్ ద్వారా రిలీజ్ డేట్‌ని తెలియజేశారు. ఈ చిత్రంలో విక్రమ్ ప్రభు మేల్ లీడ్ గా కనిపించనున్నారు. క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లముడి దర్శకత్వం వహిస్తున్నారు. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లముడి ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు. యువి క్రియేషన్స్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. బ్రిటిష్ రాజ్ కాలంలో ప్రమాదకరమైన కనుమలలో చారిత్రాత్మకంగా రోడ్లు నిర్మించిన ఘాటి సమాజ ప్రపంచాన్ని పరిచయం చేసే పవర్ ఫుల్ వాయిస్ ఓవర్‌తో ట్రైలర్ ప్రారంభమవుతుంది. ఇప్పుడు, వారు కొండల్లో డ్రగ్స్ మోసే పనుల్లో చిక్కుకుపోయారు. ఈ కఠినమైన పరిస్థితుల్లో చిక్కుకున్న ప్రేమికుల జంటగా అనుష్క శెట్టి, విక్రమ్ ప్రభు కనిపించారు.

అనుష్క పాత్ర అవినీతి వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడుతుంది. తప్పు చేస్తున్నామని గ్రహించి, ఈ చెడు వ్యవస్థకి ఎదురు నిలవడానికి సిద్ధమవుతుంది. తన వాళ్లని ఈ ప్రమాదకర వ్యాపారం నుంచి బయటకు లాగడానికి ప్రయత్నిస్తుంది. ట్రైలర్ లో అనుష్కను మునుపెప్పుడూ చూడని వైల్డ్ అవాతర్‌లో కనిపించింది. ఒక బలహీన మహిళ నుంచి క్రిమినల్, అక్కడి నుంచి లెజెండ్‌గా మారే ఆమె పాత్ర ప్రేక్షకుల్ని కట్టిపడేసింది. ఆమె అద్భుతమైన నటనతో పాత్రకి ప్రాణం పోస్తుంది. చైతన్య రావు, రవీంద్రన్ విజయ్ విలన్ పాత్రల్లో ఆకట్టుకున్నారు. ఇందులో జగపతి బాబు నటించడం సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది. దర్శకుడు క్రిష్ జాగర్లముడి ఒక ప్రత్యేకమైన, బోల్డ్ కథను తెరపైకి తెచ్చారు. ఎమోషన్, యాక్షన్ తో కథను అద్భుతంగా నడిపించారు. యువి క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రొడక్షన్ వాల్యూస్ అద్భుతంగా వున్నాయి. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో అదరగొట్టబోతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News