Sunday, April 28, 2024

గోదావరి వరద ఉధృతిని పరిశీలించిన మంత్రి పువ్వాడ..

- Advertisement -
- Advertisement -

Godavari river heavy flooded in Telangana
ఖమ్మం: అతి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో గోదావరి ఉదృతి ప్రమాద స్థాయికి చేరుకుంది. మంగళవారం ఉదయం కొంత మేర తగ్గినప్పటికి సోమవారం సాయంత్రం అధికారులు మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మూడో ప్రమాద హెచ్చరికను ప్రస్తుతం ఉపసంహరించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ సూచనల మేరకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ భద్రాచలంలోని బస చేసి అటు అధికారులను అప్రమత్తం చేస్తూనే అక్కడ పరిస్థితులను ఎప్పటికప్పుడు సిఎం కెసిఆర్ కు ఫోన్ ద్వారా పరిస్థితులను వివరిస్తున్నారు.

మంగళవారం ఉదయం గోదావరి వంతెన, కరకట్ట వద్ద గోదావరి నదీ ప్రవాహాన్ని పరిశీలించారు. ఆనంతరం పునరావాస కేంద్రాన్ని పరిశీలించారు. వారితో మాట్లాడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అల్పాహారం, అరటిపండ్లు పంపిణీ చేశారు. ఆందోళన చెందాల్సిన పని లేదని, ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని ప్రజలకు భరోసా కల్పించారు. ప్రస్తుతం నీటి మట్టం కొంతమేర తగ్గుముఖం పడుతున్నప్పటికి అధికారులు తేలికగా తీసుకోవద్దని, అధికార యంత్రాంగం నిత్య అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రస్తుతానికి ప్రమాదం లేనప్పటికీ అధికార యంత్రాంగం మరో 24గంటలు అలెర్ట్ గా ఉండాలని సూచించారు. పునరావాస కేంద్రాల్లో ఉన్న ప్రజలకు కావాల్సిన సౌకర్యాలు, ఆహారం, త్రాగునీరు, మెడిసిన్ పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచడంతో పాటు బ్లీచింగ్ శానిటేషన్ చేయలని పువ్వాడ అదేశించారు.

రానున్న రెండు రోజుల్లో వర్షాలు మరింత ఉధృతంగా ఉంటాయని వాతావరణ శాఖ తెలిపిన నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ భద్రాచలం పరిస్థితులను ఎప్పటికప్పుడు వాకోబు చేస్తున్నారని, వరద ఉదృతి పూర్తి స్థాయిలో నిలకడగా వచ్చే వరకు విశ్రమించేది లేదని స్పష్టం చేశారు. పువ్వాడ వెంట జడ్పి చైర్మన్ కోరం కనకయ్య, జిల్లా కలెక్టర్ అనుదీప్, జిల్లా ఎస్పి వినీత్, మాజి ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ దిండిగల రాజేందర్, తదితరులు ఉన్నారు..

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News