Saturday, April 27, 2024

గోషామహాల్ బిజెపి అభ్యర్థిని ఓడిస్తాం: మంత్రి కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గోషామహల్ లో బిజెపి అభ్యర్థిని ఓడిస్తామని ఆదివారం తెలంగాణ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి కెటిఆర్ చెప్పారు. రైతుబంధు కొత్త పథకం కాదు.. కొన్నేళ్లుగా కొనసాగుతున్న పథకం అన్నారు. ఇప్పటికే కొనసాగుతున్న పథకాలకు ఎన్నికల కోడ్ వర్తించదన్నారు. రాహుల్ గాంధీ 2014 నుంచి నిరుద్యోగిగా ఉన్నారని తెలిపారు. ఈ పదేళ్లలో తెలంగాణ కంటే ఎక్కువ ఉద్యోగాల భర్తీ చేసిన రాష్ట్రం లేదన్నారు.

కర్నాటకలో ఏడాదిలోపు లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామనిచెప్పారు. కర్నాటకలో ఇప్పటి వరకు ఒక్క నోటిఫికేషన్ కూడా విడుదల కాలేదని కెటిఆర్ ఆరోపించారు. బిఆర్ఎస్ శ్రేణులు ఎక్కడి వారు అక్కడ దీక్ష దివస్ జరుపుకుని సేవ కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. ఆస్పత్రుల్లో రోగులకు సేవలు, పండ్లు పంపిణీ చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణకు స్వీయ పాలనే శ్రీరామరక్ష అన్నారు. ఐటి దాడులు కేవలం కాంగ్రెస్ నేతలపైనే జరుగుతున్నాయనటం అవాస్తవం అని ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News