Tuesday, May 7, 2024

మహిళల సంక్షేమానికి ప్రభుత్వం కృషి

- Advertisement -
- Advertisement -
  • మున్సిపల్ చైర్మన్ చంద్రారెడ్డి

కీసర: తెలంగాణ ప్రభుత్వం మహిళల సంక్షేమానికి కృషి చేస్తూ తొమ్మిది సంవత్సరాలుగా ఎన్నో పథకాలను అమలు చేస్తుందని నాగా రం మున్సిపల్ చైర్మన్ కౌకుట్ల చంద్రారెడ్డి అన్నారు. మంగళవారం మున్సిప ల్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరిం చుకొని తెలంగాణ మహిళా సంక్షేమ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సం దర్భంగా ఆశావర్కర్లు, అంగన్‌వాడీ టీచర్లు, ఆర్‌పీలు, మున్సిపల్ మహిళా సిబ్బందిని సన్మానించారు.

ఈ సందర్భంగా ఛైర్మన్ చంద్రారెడ్డి మాట్లాడు తూ మహిళల సంక్షేమానికి దేశంలో ఎక్కడా లేని విధంగా విప్లవాత్మక పథ కాలు అమలు చేస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానిదని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఛైర్మన్ బండారు మల్లేష్ యాదవ్, కమిషనర్ ఎ.వాణి రెడ్డి, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News