Wednesday, May 8, 2024

గిరిజనుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి

- Advertisement -
- Advertisement -

కామారెడ్డి: గిరిజనుల సంక్షేమమే ప్రభుత్వ లక్షమని ప్ర భుత్వ విప్ గంపగోవర్ధన్ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని కెవిఆర్ గార్డెన్ లో ఆదివారం గిరిజనులకు పోడు భూముల పట్టాలను పంపిణీ చేసే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గిరిజనుల జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి ముఖ్యమంత్రి కెసిఆర్ పోడు పట్టాలను గిరిజనులకు ఇవ్వాలని నిర్ణయించారని తెలిపారు. తాండాలను గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసిన ఘనత తమ ప్ర భుత్వానికి దక్కుతుందన్నారు. గిరిజనులు ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యే అవకాశం లభించిందన్నారు.

తాండాల అభివృద్ధ్దికి ప్రభుత్వ అధిక ప్రాధాన్యత ఇవ్వడం వల్ల తండాలో మార్పు కనిపిస్తుందన్నారు. సేవాలాల్ మహారాజ్ జయంతీ వేడుకలను ప్రభుత్వ అధికారికంగా నిర్వహిస్తుందని పేర్కొన్నారు. కలెక్టర్ జితేష్ పాటిల్ మాట్లాడుతూ వందల ఏళ్లుగా గిరిజనులు అటవీ సంపదను కాపాడుకుంటూ వచ్చారని తెలిపారు. ప్రభుత్వం అర్హత గల గిరిజనులకు పోడు భూములను పంపిణీ చేసిందని చెప్పారు. గిరిజనులు తమ పిల్లలను ఉన్నత విద్యావంతులుగా మార్చాలని కోరారు.

ఈ సందర్భంగా 668 మంది లబ్ద్దిదారులకు 1668 ఎకరాలు పోడు భూమి పట్టాలను పంపిణీ చేశారు.కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ ముజీబుద్దీన్, ఎంపిపి నర్సింగ్ రావు, జెడ్పిటిసీ సభ్యుడు రామ్‌రెడ్డి, రామారెడ్డి ఎంపిపి దశరథ్ రెడ్డి, ఆర్డీవో శ్రీనివాస్ రెడ్డి, అధికారులు,ప్రజాప్రతినిధులు, మాచారెడ్డి, రామారెడ్డి మండలాల గిరిజనులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News