Sunday, May 5, 2024

గిరిజనులతో కలిసి వ్యాక్సిన్ వేయించుకోనున్న గవర్నర్

- Advertisement -
- Advertisement -

Governor Tamilisai to be vaccinated along with tribals

మ‌హేశ్వ‌రం: రంగారెడ్డి జిల్లా మ‌హేశ్వ‌రం మండ‌లం కెసి తండాలో రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర‌రాజ‌న్ ఈ నెల 12వ తేదీన ప‌ర్య‌టించ‌నున్నారు. ఈ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా గిరిజ‌నుల‌తో క‌లిసి గ‌వ‌ర్న‌ర్ కొవిడ్-19 టీకా తీసుకోనున్నారు. కోవిడ్ వ్యాక్సిన్ పట్ల గిరిజనులలో ఉన్న అపోహలు తొలగించడం, వారిలో 100శాతం వ్యాక్సినేషన్ సాధించడం లక్ష్యంగా గ‌వ‌ర్న‌ర్ కెసి తండాలో రెండో డోసు వేయించుకోవాల‌ని సంకల్పించారు. వ్యాక్సినేష‌న్‌లో మారుమూల ప్రాంతాల‌కు ప్రాధాన్యం ఇవ్వాల‌ని గతంలోనే పిలుపునిచ్చారు. ఈ దిశగా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. తమిళిసై మొదటి టీకా డోస్ ను పుదుచ్చేరి ప్రభుత్వ ఆస్పత్రిలో తీసుకున్నారు.

Governor Tamilisai to be vaccinated along with tribals

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News