Sunday, April 28, 2024

‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ ప్రత్యేక గీతావిష్కరణ

- Advertisement -
- Advertisement -

‘Green India Challenge’ special anthem

రాజ్యసభ సభ్యులు, ప్రకృతి ప్రేమికుడు, ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ వ్యవస్థాపకులు జోగినపల్లి సంతోష్ కుమార్ జన్మదినాన్ని పురస్కరించుకొని ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’పై రూపొందించిన ప్రత్యేక గీతాన్ని సోమవారం సాయంత్రం హైదరాబాద్‌లోని రవీంద్రభారతి జరిగిన కార్యక్రమంలో ఆవిష్కరించారు. రాష్ట్ర మంత్రులు వి.శ్రీనివాస్ గౌడ్, జగదీష్ రెడ్డి, టిఎస్‌ఐఐసి ఛైర్మన్ బాలమల్లు, సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, సంచాలకులు మామిడి హరికృష్ణ ఈ ప్రత్యేక గీతాన్ని విడుదల చేశారు. తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ ఛైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త నిర్మాతగా పూర్ణచందర్ డైరెక్షన్‌లో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో-వ్యవస్థాపకులు రాఘవ నేతృత్వంలో ఈ ప్రత్యేక గీతం రూపుదిద్దుకుంది. ఈ పాటకు ప్రముఖ రచయిత మాట్ల తిరుపతి రచన, సంగీతం సమకూర్చారు. ఈ కార్యక్రమంలో వివిధ కార్పొరేషన్ల ఛైర్మన్‌లు అల్లిపురం వెంకటేశ్వర రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, బిసి కమిషన్ సభ్యులు కిషోర్, శుభప్రద్ పటేల్, ఉపేందర్, రాఘవ, డైరెక్టర్ పూర్ణచందర్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News