- Advertisement -
అమరావతి: భర్త మృతిని తట్టుకోలేక భార్య గుండె ఆగిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్టం గుంటూరు జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కోరుకోల్లు గ్రామంలో యోహాను(59), ఆనందకుమారి (55) అనే దంపతులు నరసరావు పేటలో నివసిస్తున్నారు. ఈ దంపతులకు ఒక కుమార్తె ఉంది. గత కొన్ని రోజుల నుంచి భర్త అనారోగ్యానికి గురికావడంతో ఆస్పత్రులకు చూపిస్తున్నారు. ఎన్ని ఆస్పత్రుల వెంట తిరిగినా కూడా అతడి అనారోగ్యం బయటక పడలేదు. ఆదివారం అతడు కన్నుమూశాడు. ఆదివారం సాయంత్రం అతడి అంత్యక్రియలు ముగించిన తరువాత అందరూ ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన తరువాత అకస్మాత్తుగా ఆనందకుమారి చనిపోయింది. వెంటనే ఆమెకు అంత్యక్రియలు జరిపించారు. ఒక రోజులోనే ఒక కుటుంబంలో ఇద్దరు చనిపోవడంతో ఆ గ్రామం శోకసంద్రంలో మునిగిపోయింది. కుమార్తె ఒంటరిగా మిగిలిపోయింది.
- Advertisement -