Tuesday, April 30, 2024

సైబరాబాద్‌లో గ్రీవెన్స్ సమీక్ష సమావేశం

- Advertisement -
- Advertisement -

Grievances review meeting in Cyberabad

మనతెలంగాణ, సిటిబ్యూరోః గ్రీవెన్స్ సెల్‌కు వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టిఫెన్ రవీంద్ర అన్నారు. గ్రీవెన్స్ సెల్‌పై గురువారం ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపి స్టిఫెన్ రవీంద్ర మాట్లాడుతూ పోలీసు సిబ్బంది నుంచి గ్రీవెన్స్ సెల్‌కు మంచి స్పందన వస్తోందని అన్నారు. గతవారం గ్రీవెన్స్ సెల్‌కు వచ్చిన ఫిర్యాదుల పరిష్కారంపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ వారం వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని సిబ్బందిని ఆదేశించారు. సేవా పథకాల ప్రపోజల్స్, ఫంక్షనల్ వెర్టికల్స్ తదితర అంశాలపై చర్చించారు. సిఎఓలు, సెక్షన్ సూపరింటెండెంట్లు ఎప్పటికప్పుడు సమస్యలను పరిష్కరించాలని అన్నారు. సిబ్బందికి సమస్యలుంటే గ్రీవెన్స్ సెల్ నంబర్ 8333993272కు ఫోన్ చేయాలని కోరారు. సమావేశంలో డిసిపిలు ప్రకాష్ రెడ్డి, రోహిణి ప్రియదర్శిని, అనసూయ, పద్మజా, ఎడిసిపి రియాజ్ ఉల్ హక్, ఎసిపి మట్టయ్య, ఛీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ చంద్రకళ, ఛీఫ్ అడ్మిన్ ఆఫీసర్ గీత, వివిధ సెక్షన్ల సూపరింటెండెంట్లు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News