Wednesday, May 8, 2024

ప్రతి పేదోడికి ప్రభుత్వమే ఇల్లు కట్టిస్తుంది: హరీశ్ రావు

- Advertisement -
- Advertisement -

Harish Rao

మెదక్‌ః జిల్లాలోని శివంపేట మండలంలోని దంతాన్‌పల్లి-సికిండ్లపూర్‌లో రూ.4 కోట్లతో నిర్మించిన డబుల్ బెడ్‌రూం ఇండ్లను మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్రంలో చాలా మార్పులు వచ్చాయన్నారు. పేదలు ఆత్మ గౌరవంతో బ్రతకాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని.. ఇల్లులేని ప్రతీ పేదోడికి రాష్ట్ర ప్రభుత్వమే ఇల్లు కట్టిస్తుందని చెప్పారు. కరోనా వైరస్ సమయంలోనూ రైతు పండించిన పంటను ప్రభుత్వమే కొన్నదన్నారు. నర్సాపూర్ నియోజకవర్గ అభివృద్ధికి సిఎం కెసిఆర్ రూ.75 కోట్లు మంజూరు చేశారని తెలిపారు. శివంపేటకు అతి త్వరలోనే కాళేశ్వరం నీళ్లు అందిస్తామని మంత్రి చెప్పారు. అనంతరం ఆరో విడుత హరితహరంలో భాగంగా గోమారంలో ఏర్పాటు చేసిన మరితహారం కార్యక్రమంలో మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రితోపాటు ఎంఎల్‌ఎ మధన్ రెడ్డి, మాజీ మంత్రి సునితారెడ్డి, దేవేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Harish Rao begins Double bedroom houses in Shivampet

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News