Sunday, April 28, 2024

ఉస్మానియా ఆసుపత్రిలో రూ.5 భోజనాన్ని ప్రారంభించిన హరీశ్ రావు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఉస్మానియా ఆసుపత్రిలో రోగి సహాయకులు కోసం ఏర్పాటు చేసిన మూడు పూటలా భోజనం పథకాన్ని మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న హోమ్ మంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్యే రాజసింగ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. ”హైద్రాబాద్ లోని 18 ఆసుపత్రులు మూడు పూటలా భోజన కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ మానవతావాది. అధికారంలోకి వచ్చిన తర్వాత కిలోకి ఒక్క రూపాయికే ఇంట్లో ఎంత మంది ఉన్న ఒక్కక్కోరికి 6 కేజీలు ఇవ్వమని, సీలింగ్ ఎత్తివేశారు. గతంలో ఎక్కడ ఎంత మంది ఉన్న 20 కేజీలు ఇచ్చేవారు. ఎస్ సి, ఎస్ టి, బిసి హాస్టల్ లో గతంలో ఆహారం ముక్కి పోయి ఉండేది.. ఇప్పుడు సన్న బియ్యంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆహారం పెడుతుంది. కరోన సమయంలో సీఎం కేసీఆర్ గాంధీ ఆస్పత్రికి వెళ్ళినప్పుడు పేషెంట్ అటెండెర్స్ బాధ చూసి 3 పూటలా ఆహారం అందించాలని నిర్ణయం తీసుకున్నారు. గ్రేటర్ పరిధిలోని ఆసుపత్రులు దాదాపుగా రోజు రూ.20 వేల భోజనం చేస్తారని అంచనా. ఒక్క భోజనం పైన 21 రూపాయ సబ్సిడీ అమౌంట్ ప్రభుత్వం కడుతుంది. నైట్ షెల్టర్లు ను కూడా ఏర్పాటు చేస్తున్నాం. డైట్ ఛార్జలను కూడా పెంచడం జరిగింది. డైట్ ఛార్జ్ లను పెంచడం ద్వారా 43 కోట్ల రూపాయలకు పైగా భారం పడుతుంది. టెండర్లు కూడా చివరి దశలో ఉన్నాయ్. శానిటేషన్ కోసం రూ.338 కోట్లు కెటయించకోవడం జరిగింది. 50శాతం పెంచుకోవడం జరిగింది. కార్మికులకు సకాలంలో జీతాలు వచ్చే విధముగా చర్యలు తీసుకుంటున్నాము. టీమ్స్ కి, నిమ్స్ లో నూతన పడకలు ఏర్పాటుకి త్వరలో నిధులు కెటయిస్తాం. స్టాఫ్ కి, పేషెంట్ అటెండెర్స్ కి కొత్తగా నిర్మిస్తున్న సూపర్ స్పెషాలాటి ఆస్పత్రుల్లో మంచి వసతలు కూడా కల్పిస్తున్నాం. ఆరోగ్య శ్రీ కిందా అవయవ మార్పాడీలు చేస్తున్నాం. ఉస్మానియా ఆసుఫత్రిలో అభివృద్ధి పనులు చేస్తున్నాం. ఈ రోజు 45 ఐసియు పడకలు ప్రారంభించుకున్నము. ఉస్మానియా హెరిటేజ్ భవనానికి ఇబ్బంది లేకుండా కొత్త భవనము నిర్మాణాల పైన కమిటి రిపోర్ట్ ఇచ్చింది. ఫైనల్ రిపోర్ట్ రావాలి.. రిపోర్ట్ వచ్చిన తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారు” అని తెలిపారు.

Harish Rao launch Rs 5 Meels in Osmania Hospital

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News