Sunday, April 28, 2024

588 స్టేషన్లలో ఉచిత హైస్పీడ్ వైఫై సేవలు

- Advertisement -
- Advertisement -

అన్ని రైల్వే స్టేషన్‌లలో సేవలను ప్రవేశపెట్టిన దక్షిణమధ్య రైల్వే
హాల్ట్ స్టేషన్లు మినహా అన్ని స్టేషన్‌లలో సేవలు
నవంబర్‌లో 13,950 జిబి డేటాను వినియోగించుకున్న రైల్వే ప్రయాణికులు

Hi speed wifi services in Railway stations
మనతెలంగాణ/హైదరాబాద్ : భారతీయ రైల్వే ప్రయాణికులకు సకల సౌకర్యాలను కల్పించడం లో రైల్వే శాఖ ఎల్లప్పుడూ ముందంజలో ఉంటుం ది. ఈ నేపథ్యంలోనే అన్ని రైల్వే స్టేషన్లలో రైలు వినియోగదారుల కోసం హై స్పీడ్ వైఫై సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తోంది. అందులో భాగంగా దక్షిణ మ ధ్య రైల్వే తన జోన్ పరిధిలో హాల్ట్ స్టేషన్లను మినహాయించి 588 రైల్వే స్టేషన్లలో హై స్పీడ్ వైఫై సౌకర్యాన్ని విస్తరించింది. దక్షిణ మధ్య రైల్వే నెట్‌వర్క్‌లో సుమారు 6,000 రూట్ కి.మీ.ల మేర ఆప్టికల్ ఫైబర్ కేబుల్ (ఒఎఫ్‌సి)తో విస్తరించి ఉంది. ఈ నేపథ్యంలోనే భారీ స్థాయిలో రైల్వే స్టేషన్లను రై ల్వే శాఖ డిజిటల్ హబ్‌గా మార్చుతోంది.
30 మేజర్ నాన్ సబర్బన్ గ్రేడ్ స్టేషన్‌లు
ప్రస్తుతం 588 స్టేషన్లలో వైఫై సౌకర్యం కల్పించిన ట్టు రైల్వే శాఖ తెలిపింది. వీటిలో 30 మేజర్ నాన్ సబర్బన్ గ్రేడ్‌స్టేషన్లు (ఎన్‌ఎస్‌జి1, ఎన్‌ఎస్‌జి2, ఎ న్‌ఎస్‌జి3 కేటగిరి) 558 మధ్యతరహా , చిన్న స్టేష న్లు (నాన్ సబర్బన్, సబర్బన్ స్టేషన్లు) ఉన్నాయని రైల్వే అధికారులు తెలిపారు. దీంతోపాటు దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని అన్ని స్టేషన్లలో (హాల్ట్ కేటగిరి స్టేషన్లు మినహా) హై స్పీడ్ వైఫై వసతి విస్తరించినట్టు ద.మ. రైల్వే తెలిపింది. ఇప్పటికే నవంబర్ లో 13,950జిబి డేటాను ప్రయాణికులు వినియోగించుకున్నట్టు అధికారులు తెలిపారు.
సికింద్రాబాద్, కాచిగూడ, తిరుపతిలలో..
రైల్వే స్టేషన్లకు వచ్చే ప్రజలు హై డెఫినేషన్ (హెడ్ డి) వీడియోల స్ట్రీమింగ్‌కు, సినిమాలు, గేమ్స్ డౌన్‌లోడింగ్‌తో పాటు ఆన్‌లైన్‌లో వారి కార్యాలయాల విధులు నిర్వహించుకునే అవకాశాలున్నాయి. పరిమితంగా సౌకర్యాలుండే గ్రామీణ ప్రాంతాలలోని విద్యార్థులు, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారి అ వసరాల కోసం స్టేషన్‌లో ఏర్పాటు చేసిన వైఫై వసతిని వినియోగించుకోవచ్చని అధికారులు తెలిపా రు. ప్రయాణికులు వినోద కార్యక్రమాల కోసం వ్యక్తిగత డివైసెస్‌పై దీనిని వినియోగించుకోవచ్చన్నారు. దక్షిణ మధ్య రైల్వేలోని ప్రధాన స్టేషన్లయి న సికింద్రాబాద్, కాచిగూడ, విజయవాడ, తిరుపతి, గుంటూరు, నాందేడ్ మొదలగు స్టేషన్లలో ఇ ప్పటికే ఏర్పాటు చేసిన ఈ సౌకర్యంతో నెట్‌వర్క్ అనుసంధానం ఉత్తమంగా ఉందని, నెట్‌వర్క్ నిరాటంకంగా అత్యుత్తమంగా అందుబాటులో ఉంటు ందని ప్రయాణికులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
30 నిమిషాలు ఉచితం
రైలు వినియోగదారులకు మెరుగైన ఇంటర్నెట్ అ ందుబాటులో ఉండేలా ఉచిత వైఫై సర్వీసును తీసుకువచ్చినట్టు ద.మ. రైల్వే తెలిపింది. స్మార్ట్ ఫోన్ దీనిని వినియోగించుకోవచ్చని, వినియోగదారులు ప్రతిరోజు మొదటి 30 నిమిషాలు 1 ఎమ్‌బిపిఎస్ వరకు ఉచిత వైఫై సౌకర్యం పొందవచ్చని ద.మ. రైల్వే తెలిపింది. 30 నిమిషాల తరువాత ప్రయాణికులు ఆన్‌లైన్ ద్వారా నామమాత్రపు చార్జీలను చె ల్లించి ఈ సేవలను కొనసాగించుకోవచ్చని పేర్కొం ది. డిజిటల్ టెక్నాలజీ ప్రయోజనాలను సామన్య భారతీయ రైలు ప్రయాణికులకు అందించాలన్న లక్ష్యంతో భారతీయ రైల్వే, రైల్ టెల్ ఆధ్వర్యంలో ఈ వినూత్న కార్యక్రమం చేపట్టినట్టు అధికారులు తెలిపారు. డిజిటల్ ఇండియా కలలను సాకారం చేస్తూ భారతీయ రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల వినియోగ సౌకర్యార్థం రైల్ వైర్స్ వైఫై ద్వారా ఈ సాంకేతికతను ప్రయాణికులకు అందిస్తోంది.
అధికారులను అభినందించిన జిఎం
ఈ లక్ష్యాన్ని పూర్తిచేయడానికి కృషి చేసిన సిగ్నల్ టెలికమ్యునికేషన్ విభాగం అధికారులను, రైల్ టెల్ అధికారులను, ఇతర సిబ్బందిని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్య అభినందించారు. ప్రస్తుత పరిస్థితులలో స్మార్ట్ ఫోన్లు, ఇంటర్నెట్ వినియోగం పెరిగిందని, దీనికి అనుగుణంగా విప్లవాత్మక సాంకేతిక మార్పులతో స్టేషన్లలో ఏర్పాటు చేసిన వైఫై సౌకర్యంతో వినోదం, సమాచారం, విజ్ఞానం, నైపుణ్యం వంటి రంగాల్లో ప్రయాణికులకు ఇది ఎంతో ప్రయోజకరంగా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News