Wednesday, April 24, 2024

హాకీ ప్రపంచకప్ నుంచి భారత్ నిష్క్రమణ..

- Advertisement -
- Advertisement -

భువనేశ్వర్: పురుషుల ప్రపంచకప్ 2023 నుంచి భారత్ ఓటమితో నిష్క్రమించింది. ఆదివారం జరిగిన క్రాస్‌ఓవర్ మ్యాచ్‌లో భారతజట్టు పెనాల్టీ షూటౌట్‌లో 45(3/3)తేడాతో ఓటమిపాలైంది. ఈ ఓటమితో నాకౌట్‌కు చేరకుండానే వైదొలిగింది. క్వార్టర్ ఫైనల్లో చేరాలంటే గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లో పరాజయం పాలైంది. నిర్ణీత సమయంలో ఇరుజట్లు 33 గోల్స్‌తో సమానంగా నిలిచాయి. భారత్ తరఫున లలిత్ ఉపాధ్యాయ్ (17వ నిమిషం), సుఖ్‌జీత్‌సింగ్ (24వ నిమిషం), వరుణ్ కుమార్ (40వ నిమిషంలో) గోల్స్ చేశారు.

న్యూజిలాండ్ కూడా మూడు గోల్స్ చేయడంతో ఫలితం పెనాల్టీ షూటౌట్‌కు దారి తీయగా భారత్ 45 తేడాతో ఓడిపోయింది. పెనాల్టీ షూటౌట్‌లో ఇరుజట్లు చెరో నాలుగు గోల్స్ సాధించాయి. కానీ చివరి అవకాశాన్ని మిస్ చేయడంతో న్యూజిలాండ్ ఒక్క గోలు తేడాతో గెలుపొందింది. కాగా న్యూజిలాండ్ కార్టర్ ఫైనల్లో బెల్జియంతో తలపడనుంది. ఆదివారం జరిగిన మరో క్రాస్ ఓవర్ మ్యాచ్‌లో స్పెయిన్ జట్టు మలేషియాపై గెలిచి క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News