Sunday, April 28, 2024

రోడ్డు ప్రమాదంలో హోంగార్డు మృతి..

- Advertisement -
- Advertisement -

భద్రాద్రి కొత్తగూడెం: రోడ్డు ప్రమాదంలో హోంగార్డు మృతి చెందాడు. ఈ ఘటన సోమవారం ఉదయం దమ్మపేట మండలంలోని మదనపల్లిలో చోటచేసుకుంది. ఇద్దరు హోంగార్డులు బైక్ పై వెళ్తున్న సమయంలో వేనక నుంచి వేగంగా దూసకొచ్చిన ఓ వాహనం అదుపుతప్పి ఢీకొట్టింది. ఈ ఘటనలో హోంగార్డులు ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

అయితే, చికిత్స పొందుతూ అప్పారావు అనే హోంగార్డు ప్రాణాలు కోల్పోగా.. మరోకరి పరిస్థతి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News