Friday, April 26, 2024

కుటుంబ కలహాలు.. పిల్లలతో సహా గృహిణి అదృశ్యం

- Advertisement -
- Advertisement -

housewife Disappeared including children due to family quarrels

బాలాపూర్: కుటుంబ కలహాల కారణంగా తరచూ భర్తతో తలెత్తుతున్న విభేదాలతో జీవితంపై విసుగు చెంది ఇద్దరు పిల్లలతో కలిసి ఓ గృహిణి అదృశ్యమైన సంఘటన మీర్‌పేట్ పొలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్‌ఐ పి. ఆండాలు తెలిపిన వివరాల ప్రకారం.. మీర్‌పేట్ జనప్రియ మహానగర్‌లో ని వాసం ఉండే మారగౌని మల్లిఖార్జున్‌కు నల్లగొండలోని కత్లాగూడెంకు చెందిన ఎం. కరుణ(27)తో గత 8 ఏండ్ల క్రితం వివాహం జరుగగా వీరికి ప్రశాంతి (7), వైశాలి(5) అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈ నేపధ్యంలో గత 6 నెలలుగా భర్తతో తలెత్తిన కుటుంబ కలహాల కారణంగా కరుణ మల్లిఖార్జున్‌తో తరచూ గొడవపడుతున్న క్రమంలో విసుగు చెందిన కరుణ తన ఇద్దరు కుమార్తెలతో కలిసి గత రెండు నెలల క్రితం ఇంట్లో నుండి వెళ్లిపోయింది. దీంతో బంధువులు, తెలిసిన వారి వద్ద భార్య, కుమార్తెల ఆచూకీ కోసం ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోవడంతో మల్లిఖార్జున్ పొలీసులను ఆశ్రయించాడు. కాగా కరుణ సెల్‌ఫోన్ స్విచ్‌ఆఫ్‌గా ఉందని తెలుపడంతో పాటు సాగర్ అనే వ్యక్తిపై అనుమానాలు ఉన్నాయని మల్లిఖార్జున్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News