Sunday, April 28, 2024

తిరుమల ఆలయ సమాచారం..

- Advertisement -
- Advertisement -

అమరావతి: శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో రేపు(సోమవారం) ఆణివార ఆస్థానం నిర్వహించనున్నారు. రేపు సాయంత్రం పుష్ప పల్లకిలో మలయప్పస్వామి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. రేపు శ్రీవారి ఆలయంలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు టిటిడి తెలిపింది. ఈ రోజు సిఫార్సు లేఖల స్వీకరణను టీటీడి రద్దు చేసింది. కాగా, తిరుమల ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఆదివారం సెలవురోజు కావడంతో అధిక సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. దీంతో శ్రీవారి దర్శనం కోసం కృష్ణతేజ అతిథి గృహం వరకు భక్తులు వేచి ఉన్నారు. దీంతో టోకెన్లు లేని భక్తులకు స్వామివారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుందని ఆలయ అధికారులు తెలిపారు.

కాగా, శనివారం శ్రీవారిని 87,171 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.. తిరుమలలో నిన్న 38,273 మంది భక్తులు నిన్న శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.68 కోట్లు వచ్చిందని టిటిడి అధికారులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News