Wednesday, May 8, 2024

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ…

- Advertisement -
- Advertisement -

అమరావతి: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వల్పంగా భక్తుల రద్దీ పెరిగింది. గురువారం శ్రీవారి దర్శనం కోసం 9 కంపార్ట్‌మెంటులో భక్తులు వేచి ఉన్నారు. దీంతో టోకెన్లు లేని భక్తులకు స్వామివారి సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతుందని ఆలయ అధికారులు తెలిపారు.

కాగా, బుధవారం శ్రీవారిని 69,365 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమలలో నిన్న 26,006 మంది భక్తులు నిన్న శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.05కోట్లు వచ్చిందని టిటిడి అధికారులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News