Sunday, January 19, 2025

తిరుమల శ్రీవారి సమాచారం..

- Advertisement -
- Advertisement -

 Huge Devotees visit Tirumala Temple

తిరుమల: ముక్కోటి ఎకాదశి ప్రారంభమైన సందర్భంగా తిరుమల తిరుపతి శ్రీవారి ఆలయంలో గురువారం భక్తులు రద్దీ నెలకొంది. నిన్న శ్రీవారిని 25,542మంది భక్తులు దర్శించుకున్నారు. ఈ క్రమంలో భక్తులు శ్రీవారికి ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న 13,052మంది భక్తులు శ్రీవారికి తమ తలనీలాలు అర్పించుకున్నారు. శ్రీవారి హుండీకి రూ.1.59కోట్ల ఆదాయం కానుకల రూపంలో వచ్చిందని టిటిడి అధికారులు తెలిపారు. పేరాల మదనగోపాలస్వామి ప్రత్యేక అలంకారంలో భక్తలకు దర్శనమిచ్చారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు కరోనా వ్యాక్సిన్ లేనిపక్షంలో కరోనా నెగిటివ్ సర్టిఫికెట్ ను తమ వెంట తప్పనిసరిగా తెచ్చుకోవాలని టిటిడి అధికారులు సూచించారు. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు కరోనా నిబంధనలను కచ్చితంగా పాటించాలని వారు పేర్కొన్నారు.

 Huge Devotees visit Tirumala Temple

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News