Tuesday, April 30, 2024

రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు మృతి

- Advertisement -
- Advertisement -

ఇల్లందు : లలితాపురం గ్రామసమీపంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు దుర్మరణం పాలైన సంఘటన గురువారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన దంపతులు నెడికొండ సుబ్బారావు, లలితమ్మలు ద్విచక్ర వాహనంపై ఇల్లందు వైపునకు వస్తుండగా ఎదురుగా వచ్చిన కంటెయినర్ వాహనం ఢీకొట్టింది. దీంతో సుబ్బారావు అక్కడికక్కడే మృతి చెందగా తీవ్రంగా గాయపడిన లలితమ్మను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా ఆసుపత్రిలో చేరిన కొద్దిసేపటికే లలితమ్మ మృతిచెందింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News