- Advertisement -
హైదరాబాద్: భాగ్య నగర ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సిపి అంజనీకుమార్ సూచించారు. నిమ్స్లో చికిత్స పొందుతున్న కరోనా బాధితుల ఆరోగ్య పరిస్థితిని రోగి బంధువులకు వివరించేందుకు హెల్ప్ డెస్క్ను ప్రారంభించామన్నారు. కరోనా సెకండ్ వేవ్లో ఫ్రంట్ లైన్ వర్కర్స్ వైద్యసిబ్బంది, పోలీసులకు సహాయం సహకారాలు అందించడంతో పాటు కరోనా వైరస్ వ్యాప్తి తగిన జాగ్రత్తలు తీసుకుందామన్నారు. డాక్టర్లు, వైద్య సిబ్బంది అద్భుతంగా పని చేస్తున్నారని కొనియాడారు. పోలీసుల సహాయంతోనే హెల్ప్ డెస్క్ నిర్వహిస్తున్నామని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.
- Advertisement -