హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చే మెడిసిన్ నా వద్ద ఉందని, టిపిసిసి అధ్యక్ష పదవి మార్పు జరిగితే తనకు ఇవ్వాలని కోరినట్లు సీనియర్ కాంగ్రెస్ శాసన సభ్యులు జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం మధ్యాహ్నం గాంధీభవన్ సమావేశం మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. టిపిసిసి అధ్యక్ష పదవిలో ఉత్తమ్ కుమార్ రెడ్డిని కొనసాగిస్తే, తాను వ్యతిరేకిచడం లేదని స్పష్టం చేశారు. పార్టీ అధ్యక్ష పదవి మార్పు జరిగితే, తనకు అవకాశం ఇవ్వాలని పార్టీ పెద్దలను కోరినట్లు వెల్లడించారు. అలాగే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చే మెడిసిన్ తన వద్ద ఉందని వ్యాఖ్యనించారు. ఈ సందర్భంగా సంగారెడ్డి నియోజక వర్గం పరిధిలో 130 ఫీట్ల ఎత్తు జాతిపితా గాంధీ విగ్రహాం, 60 ఫీట్ల ఎత్తు పండిత్ నెహ్రూ విగ్రహాలను ఏర్పాటు చేస్తామని ఆయన ప్రకటించారు.