Monday, May 13, 2024

మిగ్21 విమానం కుప్పకూలి పైలట్ మృతి

- Advertisement -
- Advertisement -

IAF Pilot killed in MiG-21 plane crash

న్యూఢిల్లీ : భారత వాయుసేనకు చెందిన మిగ్ 21 బైసన్ విమానం బుధవారం మధ్యాహ్నం గ్వాలియర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌లో కుప్పకూలడంతో వాయుసేనకు చెందిన గ్రూప్ కెప్టెన్ ఎ. గుప్తా మృతి చెందారు. రోజువారీ యుద్ధ విన్యాసాల శిక్షణ సందర్భంగా బయల్దేరిన విమానం కొద్దిసేపటికే ప్రమాదంలో చిక్కుకుందని ప్రాథమిక సమాచారం బట్టి తెలియవచ్చింది. దీనిపై దర్యాప్తు ప్రారంభమైంది. గత 18 నెలల్లో మిగ్ 21 శ్రేణి విమానాలు ప్రమాదానికి గురి కావడం ఇది మూడోసారి. 2019 సెప్టెంబర్‌లో ఇదే విమానస్థావరంలో మిగ్ 21 ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదాల కారణంగా భారత్ విమానాలను నష్టపోవడం, ఫైటర్ పైలట్లను కూడా కోల్పోవడం జరుగుతోంది.

IAF Pilot killed in MiG-21 plane crash

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News