Sunday, May 12, 2024

నన్నే బలమైన అభ్యర్థిగా బిజెపి భావిస్తోంది: రాజగోపాల్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

MLA Rajagopal Reddy reacts on Contest in Sagar By Poll

హైదరాబాద్: నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో నన్నే బలమైన అభ్యర్థినని బిజెపి భావిస్తోందని మునుగోడు కాంగ్రెస్ ఎంఎల్ఎ రాజగోపాల్ రెడ్డి అన్నారు. బుధవారం ఓ మీడియాతో జరిపిన చిట్ చాట్ లో రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ”గతంలో చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నాను. సాగర్ టికెట్ ఇస్తామని బిజెపి చెప్పిన మాట వాస్తవమే. మునుగోడులో రిజైన్ చేసి సాగర్ లో పోటీ చేయమన్నారు. పోటీ విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. నేను బరిలో ఉంటే బిజెపి, టిఆర్ఎస్ మధ్యే పోటీ ఉంటుంది. నాతో మాట్లాడిన బిజెపి నేతల పేర్లు చెప్పను. కెసిఆర్ ఫ్యామిలీలో కుటుంబ కలహాలున్నాయి. కుటుంబ సభ్యులే కెటిఆర్ ను సిఎం కాకుండా అడ్డుకున్నారు. కెసిఆర్ పాలనలో సంతోష్, హరీష్, కవిత హవా నడుస్తోంది. కెటిఆర్ సిఎం అయితే.. హరీష్, సంతోష్, కవిత సైడ్ అవుతారు. టిఆర్ఎస్ ను ఓడించాలంటే బిజెపితోనే సాధ్యం” అని రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు.

MLA Rajagopal Reddy reacts on Contest in Sagar By Poll

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News