Saturday, July 27, 2024

ఆగి ఉన్న ఆటోపైకి దూసుకెళ్లిన లారీ: హెడ్ కానిస్టేబుల్ మృతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సూర్యాపేట జిల్లా కొదాడ-జడ్చర్ల ప్రధాన రహదారిపై ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న ఆటోపైకి లారీ దూసుకెళ్లడంతో ఓ హెడ్ కానిస్టేబుల్ మృతి చెందగా పది మంది తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. మరియదాసు (57) అనే హెడ్ కానిస్టేబుల్ మల్లెపల్లి నుంచి మాచర్ల వెళ్లే రహదారిపై విధులు నిర్వహిస్తున్నాడు. ఓ ఆటో పది మంది ప్రయాణికులతో పెట్రోల్ బంకు డీజిల్ పోసుకొని బయటకు రాగానే వాహనాన్ని మరియదాసు ఆపి మాట్లాడుతున్నాడు. అదే సమయంలో లారీ అతివేగంగా వచ్చి ఆటోతో పాటు హెడ్‌కానిస్టేబుల్‌ను  ఢీకొట్టింది. హెడ్ కానిస్టేబుల్ ఘటనా స్థలంలో మృతి చెందగా గాయపడిన పది మందిని ఆస్పత్రికి తరలించారు. గుడిపల్లి ఎస్‌ఐ నర్సింహులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఢీకొట్టిన లారీకి సంబంధించిన వివరాలు ఇప్పటివరకు బయటకు రాలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News