Monday, May 6, 2024

రూ.20 కోసం గొడవ.. థానేలో ఓ వ్యక్తి హత్య

- Advertisement -
- Advertisement -

Idli seller killed by 3 customers in Thane

 

ముంబయి: ఓ ఇడ్లి బండి యజమానితో ముగ్గురు వినియోగదారులకు రూ.20 విషయంలో తలెత్తిన గొడవ హత్యకు దారితీసింది. శుక్రవారం ఉదయం మహారాష్ట్రలోని థానేలో ఈ దుర్ఘటన జరిగింది. మీరా రోడ్డులో ఇడ్లీ బండి నడుపుతున్న వీరేంద్రయాదవ్(26)తో గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు తమకు రూ.20 ఇవ్వాల్పి ఉన్నదంటూ గొడవపడ్డారు. వాగ్వాదం ముదిరి తోపులాటకు దారితీసింది. వీరేంద్రను గట్టిగా తోసేయడంతో కిందపడ్డ ఆయన తలకు బలమైన గాయమైంది. స్థానికులు వెంటనే వీరేంద్రను ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆయన మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. మీరారోడ్డులోని నయానగర్ పోలీస్ స్టేషన్‌లో ముగ్గురు నిందితులపై కేసు నమోదైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News