Tuesday, May 21, 2024

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం

- Advertisement -
- Advertisement -

ముంబై : మహారాష్ట్ర థానే జిల్లాలోని షాపూర్ సమీపంలో జరుగుతున్న సమృద్ధి ఎక్స్‌ప్రెస్ హై వే నిర్మాణం మూడో దశ పనుల్లో సోమవారం అర్ధరాత్రి దాటాక ఘోర ప్రమాదం జరిగింది. ముం బైకి 80 కిమీ దూరంలో సార్లంబే గ్రామం వద్ద ఈ ప్రమాదం జరిగింది. బ్రిడ్జిల నిర్మాణాని కి ఉపయోగించే గిర్డర్ లాంచర్ దాదాపు 35 మీటర్లు (114 అడుగులు) ఎత్తు నుండి కుప్పకూలడంతో పది మంది కార్మికులతోపాటు మొ త్తం 20 మంది మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గిర్డర్ లాంచర్‌తోపాటు 700 టన్నుల బరువున్న క్రేన్ కూలిపోవడంతో కార్మికులు ముగ్గురు కార్మికులు భయం తో చిక్కుకున్నారని మహారాష్ట్ర రాష్ట్ర రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎంఎస్‌ఆర్‌డిసి) ప్రకటించింది. మృతుల్లో పది మంది కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు, ఐదుగురు ఉద్యోగులు ఉన్నారని ఈ ప్రాజెక్టు పనులు నిర్వహిస్తున్న ఎంఎస్‌ఆర్‌డిసి వివరించింది. ఆటోమేటిక్ లాంచర్‌ను తొలగించే పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. గిర్డర్ లాంచర్ కుప్పకూలడం కేవలం నిర్లక్షం వల్ల జరిగిందని ఆరోపిస్తూ ఇద్దరు కాంట్రాక్టర్లపై థానే జిల్లా పోలీస్‌లు కేసు నమోదు చేశారు. గాయపడిన ముగ్గురికి థానే లోని కల్వవద్ద ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆస్పత్రిలో చికిత్స చేస్తున్నారు. మహారాష్ట్ర డిప్యూటీ సిఎం దేవేంద్ర ఫడ్నవిస్, ఈ ప్రమాదంపై తీవ్ర విచారం వెలిబుచ్చారు. దీనిపై దర్యాప్తుకు ఆదేశించారు. ముఖ్యమంత్రి షిండే మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల వంతున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.
ప్రధాని మోడీ తీవ్ర సంతాపం
ప్రధాని మోడీ ఈ ప్రమాదంలో మృతి చెందిన వా రి కుటుంబాలకు తీవ్ర సంతాపం వెలిబుచ్చారు. రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియో ప్రకటించారు. గాయపడిన వారికి రూ.50 వేలు ఆర్థిక సా యం ప్రకటించారు. హోం మంత్రి అమిత్ షా తన సంతాపాన్నిసంతాపాన్ని తెలియజేస్తూ నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్‌డిఆర్‌ఎఫ్) బృందాలు రిస్కూ కార్యక్రమాలు చేపట్టాయని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News