Tuesday, April 30, 2024

ఆర్‌బిఐ వేలంలో రూ. 500 కోట్ల రుణ సమీకరణ

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం మరి కొంత సొమ్ము రుణంగా తీసుకోనున్నది. ఈ నెల 17వ తేదీన (మంగళవారం) రిజర్వుబ్యాంక్ నిర్వహించే సెక్యూరిటీ బాండ్ల వేలంలో తెలంగాణ రాష్ట్రాన్ని కేంద్రం అనుమతించడంతో.. మరో రూ.500 కోట్లను రుణంగా సమీకరించుకోనుంది. ఇందుకోసం 16 ఏళ్ల కాలానికి రూ. 500 కోట్ల మేర రాష్ట్ర ఆర్థిక శాఖ బాండ్లు జారీ చేసింది. వేలం అనంతరం రాష్ట్ర ఖజానాకు ఆ మొత్తం సమకూరుతుంది.

తెలంగాణతో పాటు మరో 14 రాష్ట్రాలు ఈ వేలం ద్వారా రూ.15,882 కోట్ల రుణాలను సమీకరించనున్నాయి. వాటిలో ఆంధ్రప్రదేశ్, అస్సాం, బీహార్, గోవా, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ, కాశ్మీర్, కర్ణాటక, మేఘాలయ, మిజోరం, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తర ప్రదేశ్, పశ్చిమబెంగాల్ , రాష్ట్రాలు మొత్తం రూ. 15,882 కోట్ల రుణాన్ని బాండ్ల వేలంలో సమీకరించుకోనున్నాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News