Sunday, May 19, 2024

రెండో రోజు ముగిసిన ఆట.. శ్రీలంక 108/4

- Advertisement -
- Advertisement -

IND vs SL 1st Day 2: Sri Lanka Stumps at 108/4

మొహాలీ స్టేడియం వేదికగా టీమిండియా, శ్రీలంక జట్ల మద్య జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజు ఆట ముగిసింది. ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేపట్టిన భారత్ తొలి ఇన్నింగ్స్ లో 574/8 వద్ద డిక్లేర్ చేసింది. రవీంద్ర జడేజా(175 నాటౌట్) భారీ శతకంతో చెలరేగగా, రిషబ్ పంత్(96), అశ్విన్(61), హనుమ విహారి(58) అర్థ సెంచరీలతో రాణించారు. దీంతో భారత్ భారీ స్కోరు సాధించింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ను ప్రారంభించిన శ్రీలంక రెండో రోజు ఆట ముగిసే సమయానికి 43 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 108 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో నిశాంక(26), అసలంక(1)లు ఉన్నారు.

IND vs SL 1st Test Day 2: Sri Lanka Stumps at 108/4

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News