Sunday, April 28, 2024

World Cup 2023: 191 పరుగులకే పాకిస్థాన్‌ ఆలౌట్

- Advertisement -
- Advertisement -

అహ్మదాబాద్‌: ప్రపంచకప్‌లో భాగంగా నరేంద్ర మోడీ స్టేడియంలో శనివారం జరిగిన మ్యాచ్‌లో భారత బౌలర్లు ఏకంగా పాకిస్థాన్‌ను 191 పరుగులకే ఆలౌట్ చేశారు. ఫాస్ట్ బౌలింగ్‌లో జస్పిర్ట్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, హార్దిక్ పాండ్యా చెరో వికెట్ తీశారు. స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా కూడా రెండేసి వికెట్లు పడగొట్టడంతో పాక్ 42.5 ఓవర్లలో ఆలౌటైంది. పాకిస్థాన్ తరఫున కెప్టెన్ బాబర్ అజామ్ 58 బంతుల్లో 50 పరుగులు చేయగా, మహ్మద్ రిజ్వాన్ 69 బంతుల్లో 49 పరుగులు చేశాడు. రెండు వికెట్ల నష్టానికి 155 పరుగుల వద్ద పాకిస్థాన్ 191 పరుగులకు ఆలౌటైంది.

సంక్షిప్త స్కోర్లు: 42.5 ఓవర్లలో 191 ఆలౌట్ (బాబర్ ఆజం 50, మహ్మద్ రిజ్వాన్ 49; జస్ప్రీత్ బుమ్రా 2/19, మహ్మద్ సిరాజ్ 2/50, కుల్దీప్ యాదవ్ 2/35, రవీంద్ర జడేజా 2/38) vs భారత్.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News