Thursday, May 2, 2024

భారత్‌లో 46,254 పాజిటివ్ కేసులు….

- Advertisement -
- Advertisement -

India corona virus cases state wise

ఢిల్లీ: భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖంపడుతోంది. గత పది రోజుల నుంచి దాదాపుగా ప్రతి రోజూ 50వేలకు లోపే కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో దేశంలో 46,254 కరోనా కేసులు నమోదుకాగా 514 మంది మృతి చెందారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. భారత్‌లో ఇప్పటివరకు 83.13 లక్షలకు చేరుకోగా 1.23 లక్షల మంది మృత్యువాతపడ్డారు. కరోనా వ్యాధి నుంచి 76.56 లక్షల మంది కోలుకోగా 5.33 లక్షల మంది చికిత్స తీసుకుంటున్నారు. మంగళవారం ఒక్క రోజే 12.09 లక్షల మంది కరోనా టెస్టులు చేయగా మొత్తం టెస్టుల సంఖ్య 1.12 కోట్లకు చేరుకుందని ఐసిఎంఆర్ ప్రకటించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News