- Advertisement -
పాకిస్తాన్లోని లాహోర్లో మోహరించిన హెచ్క్యూ 9 క్షిపణి రక్షణ వ్యవస్థను భారత్ ప్రయోగించిన డ్రోన్ ధ్వంసం చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇజ్రాయెల్ తయారు చేసిన హర్పి కమికజే డ్రోన్ను భారత్ ప్రయోగించింది. చైనా తయారు చేసిన హెచ్క్యూ 9 భారత్ డ్రోన్ను అడ్డుకోవడంలో విఫలమైంది. ఈ డ్రోన్ నేరుగా హెచ్క్యూ 9 ఢీకొన్నట్లు తెలిసింది. దీంతో అది పూర్తిగా ధ్వంసమైందని ఆ వర్గాలు తెలిపాయి.
- Advertisement -