Thursday, May 2, 2024

భారత్ పెద్ద మనసుతో పాకిస్తాన్ ను ఆదుకోవాలి: అక్తర్

- Advertisement -
- Advertisement -

akhtar

 

కరాచీ: కరోనా కోరల్లో చిక్కుకున్న పాకిస్థాన్‌కు అండగా నిలువాలని పాక్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ భారత్‌ను కోరాడు. కరోనా మహమ్మరి రోజురోజుకు తీవ్ర రూపం దాల్చుతుండడంతో పాకిస్థాన్ పరిస్థితి దయనీయంగా మారిందన్నాడు. ఇలాంటి స్థితిలో తమ దేశాన్ని ఆదుకోవడానికి భారత్ పెద్ద మనసుతో ముందుకు రావాలన్నాడు. ప్రస్తుతం పాకిస్థాన్‌లో వెంటిలెటర్ల కొరత తీవ్రంగా ఉందన్నాడు. భారత్‌తో పోల్చితే పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉందని, తమకు కావాల్సిన వెంటిలెటర్లను అందించి కరోనా బాధితులను కాపాడాలని అక్తర్ వేడుకున్నాడు. ఇరు దేశాల మధ్య ఉన్న ఉద్రిక్త పరిస్థితులను పక్కన బెట్టి మానవత దృక్ఫథంతో భారత్ సహాయం చేయాలని ఈ మాజీ స్పీడ్‌స్టర్ కోరాడు.

India & Pakistan need to fight Covid 19 together: Akhtar

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News