Sunday, May 5, 2024

దేశంలో కొత్తగా 20,279 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

India records 20279 new Covid-19 cases

న్యూఢిల్లీ: దేశంలో గత కొన్ని రోజులుగా తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 20,279 కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 18,143 మంది బాధితులు ఈ మహమ్మారి నుంచి కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం 1,52,200 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. భారత్ లో రోజువారీ పాజిటివిటీ రేటు 5.29 శాతానికి పెరిగింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 201.99 కోట్ల మందికి కరోనా టీకా డోసులు పంపిణీ చేసినట్లు కేంద్రం ఆరోగ్యమంత్రివ్వ శాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లోపేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News