Tuesday, May 7, 2024

దేశంలో 2వేలకు పడిపోయిన కరోనా కేసులు..

- Advertisement -
- Advertisement -

India Reports 2503 new corona Cases in 24 hrs

న్యూఢిల్లీ: దేశంలో మహమ్మారి క‌రోనా వైరస్ కేసులు భారీగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో కొత్త‌గా 2503 పాజిటివ్ కేసులు న‌మోదైన‌ట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్ల‌డించింది. కరోనాతో మరో 27 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది. దీంతో దేశంలో మొత్తం కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య 4.29కోట్లు దాటింది. గత 24 గంటల్లో కరోనా వైరస్ నుంచి 4,377మంది కోలుకోగా..  దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు 4.24కోట్లకు పైగా బాధితులు కోలుకున్నారు. ఇక, కరోనాతో దేశంలో మొత్తం 5,15,877మంది బాధితులు మరణించారు. ప్ర‌స్తుతం దేశ వ్యాప్తంగా 36,168 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పటివరకు కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసిన సంఖ్య 180కోట్లకు చేరుకుంది.

India Reports 2503 new corona Cases in 24 hrs

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News