- Advertisement -
న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్ కేసులు భారీగా తగ్గాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం గత 24 గంటల్లో 9,121 కొత్త కోవిడ్-19 కేసులు, 81 మరణాలు సంభవించాయి. అదే సమయంలో 11,805 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,09,25,710కి చేరింది. 1,06,33,025 మంది బాధితులు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దేశవ్యాప్తంగా 1,55,813 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇండియాలో ప్రస్తుతం 1,36,872 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. దేశంలో ఇప్పటివరకు 87,20,822 మందికి కరోనా టీకాలు వేసినట్టు ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
India reports 9121 new Covid-19 cases
- Advertisement -