Sunday, April 28, 2024

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో బస్సు ప్రమాదం: 22మంది మృతి

- Advertisement -
- Advertisement -

bus fell into canal in madhya pradesh satna

భోపాల్ : డ్రైవర్‌ నియంత్రణ కోల్పోవడంతో 54 మంది ప్రయాణికులతో వెళుతున్న బస్సు సిధిలోని కాలువలో పడింది. ఈ సంఘటన మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని మంగ‌ళ‌వారం ఉదయం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో 22మంది ప్రాణాలు కోల్పోయారు. బస్సు కాలువలో పడగానే ప్ర‌యాణికులంద‌రూ గ‌ల్లంతయ్యారు. క్రేన్ స‌హాయంతో బ‌స్సును బ‌య‌ట‌కు తీశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ప్రస్తుతం గ‌ల్లంతైన వారి ఆచూకీ కోసం పోలీసులు స‌హాయ‌క చ‌ర్య‌లు చేస్తున్నారు. ఈ ఘ‌ట‌న‌పై మ‌ధ్య‌ప్ర‌దేశ్ సిఎం శివ‌రాజ్ సింగ్ చౌహాన్ తీవ్ర దిగ్ర్భాంతి వ్య‌క్తం చేశారు. స‌హాయ‌క చ‌ర్య‌లు వేగవంతం చేయాల‌న్నారు. ఈ ఘ‌ట‌న‌పై పూర్తి స్థాయిలో ద‌ర్యాప్తు జ‌ర‌పాల‌ని శివ‌రాజ్ సింగ్ చౌహాన్ పోలీసులను ఆదేశించారు‌.

 

bus fell into canal in madhya pradesh satna

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News