Thursday, May 2, 2024

పుజారా ఔట్…. భారత్ 250/4

- Advertisement -
- Advertisement -

సిడ్నీ: భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్ ఐదో రోజు భారత జట్టు 79.4 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 250 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. ఛటేశ్వరా పూజారా, రిషబ్ పంత్ హాఫ్ సెంచరీలతో అదరగొట్టారు. మూడో వికెట్‌పై ఇద్దరు కలిసి 148 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. రిషబ్ పంత్ 97 పరుగులు చేసి లయాన్ బౌలింగ్ లో కమ్నీస్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. పంత్ దూకుడుగా ఆడుతుండడంతో గెలుస్తామనే ధీమా వచ్చింది. కెప్టెన్ అజింక్య రహానే నాలుగు పరుగులు చేసి లయాన్ బౌలింగ్ లో మాథ్యూ వాడేకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం క్రీజులో పూజారా(58), హనుమాన్ విహారీ(04)  పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. ఆసీస్ బౌలర్లలో నాథన్ లయాన్, హాజీల్ వుడ్ కు చెరో రెండు వికెట్లు పడగా కమ్నీస్ ఒక వికెట్ తీశాడు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News