యుద్ధం జరిగితే తీసుకోవాల్సిన రక్షణ చర్యలపై మాక్డ్రిల్ నిర్వహించాలని రాష్ట్రాలకు కేంద్రం లేఖలు
ప్రజలను అన్ని విధాల సమాయత్తం చేయడమే లక్ష్యం ప్రధాని మోడీతో రక్షణశాఖ కార్యదర్శి భేటీ ఉగ్రవాదంపై
పోరులో భారత్కు రష్యా, జపాన్ మద్దతు మోడీకి రష్యా అధ్యక్షుడు పుతిన్ ఫోన్ మంత్రి రాజ్నాథ్సింగ్ను
కలిసి మద్దతు తెలిపిన జపాన్ రక్షణ మంత్రి పాకిస్తాన్కు నిధులు ఇవ్వవద్దని ఎడిబిని కోరిన ఇండియా
పాకిస్తాన్ నీళ్లకు ఎసరు తాజాగా సలాల్ డ్యామ్ను మూసివేసిన భారత్ ఇప్పటికే బాగ్లిహార్ డ్యామ్ నుంచి
నీటి సరఫరా నిలిపివేత నీళ్లు ఆపితే అణుదాడి చేస్తామని పాక్ హుంకరింపు సంయమనం పాటించాలని
భారత్, పాకిస్తాన్లకు ఐక్యరాజ్యసమితి చీఫ్ విజ్ఞప్తి ఏ సమస్యకైనా సైనిక పరిష్కారం ఉండదని హితవు
న్యూఢిల్లీ : పాక్తో యుద్ధం జరిగితే , లేదా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరిగితే మనం జనం ఏ విధంగా స్పందించాలి? దాడుల నుంచి ఏ విధంగా తట్టుకోవాలి? ఎటువంటి రక్షణ చర్యలకు దిగాలి? అనే విషయాలపై ఈ నెల 7వ తేదీ బుధవారం సామూహిక జాగ్రత్త చర్యలు అంటే మాక్ డ్రిల్స్ నిర్వహించాలని కేంద్రం రాష్ట్రాలకు తాజాగా ఆదేశాలు వెలువరించింది. కేంద్ర హోం మంత్రిత్వశాఖ తరఫున ఈ మాక్ డ్రిల్స్కు సూచనలు వెలువడ్డాయి. ఇది సలహాపూరిత చర్య అని, ప్రజలను అన్ని విధాలుగా సమాయత్తం చేసేందుకు ఈ డ్రిల్స్ అవసరం అని కేంద్రం రాష్ట్రాలకు పంపించిన లేఖలలో తెలిపారు. ఈ డ్రిల్స్ చేపడుతారు. ఇందులో భాగంగానే ముందు వైమానిక దాడుల సంబంధిత సైరన్స్ వెలువరించడం, దీనికి అనుగుణంగా జనం తమను తాము రక్షించుకోవడం వంటి వాటిపై నమూనా ప్రదర్శనలు ఉంటాయి.
భారత్లో ఎక్కువగా యుద్ధ వాతావరణం, దాడుల నేపథ్యం ఉండదు కాబట్టి అసాధారణ పరిస్థితి ఏర్పడితే ఏ విధంగా అప్రమత్తం కావల్సి ఉంటుందనేది కీలకం అవుతోంది. కొన్ని నిర్థిష్ట ప్రాంతాలలో టన్నెల్స్ ఏర్పాటు, వైమానిక దాడులు జరిగితే జనం వీటిలోకి చేరుకోవడం, వదంతులు నమ్మకుండా కలిసికట్టుగా ఉండటం వంటి వాటిని ఈ డ్రిల్స్లో తెలియచేస్తారు. బ్లాకౌట్లు, కీలక స్థావరాల రక్షణ, ప్రజలను తరలించడం వంటి వాటిపై రిహార్సల్స్ చేపడుతారు. పహల్గాం దాడుల తరువాత భారత్ పాకిస్థాన్ మధ్య తీవ్రస్థాయి ఉద్రిక్తత నెలకొంది. అన్ని రకాల సంబంధాలు తెగిపొయ్యాయి.
ప్రధాని మోడీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తరచూ భద్రతా రక్షణ ఉన్నతాధికారులతో సమీక్షలు జరుపుతున్నారు. ఎప్రిల్ 22వ తేదీన జరిగిన ఉగ్రదాడులకు ప్రతి చర్య ఉంటుందని ప్రధాని మోడీ, రక్షణ మంత్రి పదేపదే పాకిస్థాన్కు హెచ్చరికలు వెలువరిస్తున్నారు. ఈ దశలోనే మనం మనం రక్షించుకునేందుకు అవసరం అయిన మాక్ డ్రిల్స్ అత్యవసరం అని లేఖలలో రాష్ట్రాలకు కేంద్రం తెలిపింది. శత్రువులు ఊహించని స్థాయిలో ఉంటాయని ప్రధాని తెలిపారు. భూమి అంచుల్లో శత్రువు ఉనికి ఎక్కడున్నా పసికట్టి పనిపట్టి తీరుతామని ఉగ్రవాదులకు హెచ్చరికలు వెలువరించారు. ఇక యువకులు, విద్యార్థులు యుద్ధం జరిగితే స్పందించడం, అవసరం బట్టి ప్రతిదాడికి దిగడం వంటి వాటిపై సూచనలు వెలువరిస్తారు. ప్రత్యేకించి సరిహద్దు రాష్ట్రాలలో అంటే పంజాబ్, కశ్మీర్, ఢిల్లీ ఇతర ప్రాంతాల్లో ఈ డ్రిల్స్కు ప్రాధాన్యతను ఇస్తారు.