Sunday, April 28, 2024

రోయింగ్‌లో భారత్‌కు స్వర్ణం

- Advertisement -
- Advertisement -

India wins gold at Asian Rowing Championships

 

బ్యాంకాక్: థాయిలాండ్ వేదికగా జరిగిన ఆసియా రోయింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు స్వర్ణం లభించింది. పురుషుల డబుల్స్ స్కల్స్ విభాగంలో భారత్‌కు చెందిన అర్జున్ లాల్వ్రి జంట పసిడి పతకం సొంతం చేసుకుంది. ఇక పురుషుల సింగిల్స్ విభాగంలో పర్మిందర్ సింగ్ రజతం సాధించాడు. శనివారం జరిగిన డబుల్స్ ఫైనల్లో భారత జోడీ అద్భుత ఆటతో ప్రథమ స్థానాన్ని దక్కించుకుంది. చైనా, ఉజ్బెకిస్థాన్ జంటలతోతీవ్ర పోటీలు ఎదురైనా చివరి వరకు ఏకాగ్రను కనబరిచిన భారత జంట పసిడి పతకాన్ని కైవసం చేసుకుంది. భారత జోడీ 6:57:883 నిమిషాల్లో రేసును పూర్తి చేసింది. ఇక పర్మిందర్ సింగిల్స్ విభాగంలో రజతం దక్కించుకున్నాడు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News