Monday, May 6, 2024

బిపిన్‌రావత్ దంపతుల అస్థికలకు గంగానదిలో నిమజ్జనం

- Advertisement -
- Advertisement -

Bipin Rawat's daughters immerse ashes of parents in Ganga

 

డెహ్రాడూన్: హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన జనరల్ బిపిన్‌రావత్, ఆయన భార్య మధులికల అస్థికల్ని హరిద్వార్‌లోని గంగానదిలో నిమజ్జనం చేశారు. వారి కుమార్తెలు తరిణి, కృతికలు సంప్రదాయికంగా ఈ క్రతువును నిర్వహించారు. శనివారం సైనిక లాంఛనాల మధ్య ఈ కార్యక్రమం జరిగింది. ఇద్దరు పూజారులతో ఈ కర్మకాండను నిర్వహింపజేశారు. ఈ సందర్భంగా రావత్ కుమార్తెలను ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్‌ధామి పరామర్శించారు. ప్రజల మనసుల్లో రావత్ చిరస్మరణీయులని ధామి నివాళులర్పించారు. జనరల్ రావత్ సొంత రాష్ట్రం ఉత్తరాఖండ్. పౌరీ జిల్లాలోని సైనా గ్రామంలో ఆయన జన్మించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News