Tuesday, May 7, 2024

కాబూల్‌లో ఇండియన్ కిడ్నాప్

- Advertisement -
- Advertisement -

Indian kidnapping in Kabul

న్యూఢిల్లీ : తాలిబన్ల అఫ్ఘనిస్థాన్‌లో భారతీయుడు బన్‌స్రీ లాల్ అరేంధ్ కిడ్నాప్‌పై భారత ప్రభుత్వం స్పందించింది. కాబూల్‌లో అరేంధ్‌ను గుర్తుతెలియని వ్యక్తులు మంగళవారం తుపాకీతో బెదిరించి అపహరించుకువెళ్లారు. సంబంధిత అంశంపై తాము అధికారులతో సంప్రదిస్తున్నామని , వారు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం అందిందని , ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షించుకుంటామని విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్జీ గురువారం ఇక్కడ విలేకరులకు తెలిపారు. అరేంధ్ భారతీయుడేనా అని విలేకరులు ప్రశ్నించగా , ఇప్పటికైతే ఆయన భారతీయ పౌరుడనే తెలిందని, పూర్తి వివరాలను రాబట్టుకుంటామని తెలిపారు. అరేంధ్ కుటుంబం ఫరీదాబాద్‌లో నివసిస్తుంది. చాలా ఏళ్లుగా కాబూల్‌లో వ్యాపారం చేస్తున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News