Friday, May 3, 2024

అమెరికా… రక్తపు మడుగులో భారత దంపతులు…

- Advertisement -
- Advertisement -

Indian Techie Wife Found Dead in new jersey

 

న్యూయార్క్: భారత్ చెందిన ఐటి ఉద్యోగి, అతడి భార్య రక్తపు మడుగులో కనిపించిన సంఘటన అమెరికాలోని న్యూజెర్సీలో జరిగింది. ఉత్తర అర్లింగ్టన్ లోని బాల్కనీలో నాల్గేళ్ల  పాప  ఏడుస్తుండడంతో  స్థానికులు పోలీసులకు సమాచారం. పోలీసులు అక్కడికి చేరుకొని డోర్ బద్దలుకొట్టి చూడగా దంపతులు ఇద్దరు రక్తపు మడుగులో కనిపించారు.  పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…… మహారాష్ట్రలోని బీద్ జిల్లా అంబజోగాయి ప్రాంతానికి చెందిన బాలాజీ రుద్రావర్(32) 2015లో అమెరికాకు వెళ్లాడు.  ఓ ఐటి కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. తన భార్య ఆర్తితో (30) కలిసి న్యూజెర్సీలోని ఉత్తర అర్లింగ్టన్ లో అపార్ట్ మెంట్ లో నివసిస్తున్నారు. ఈ దంపతులకు నాలుగేళ్ల పాప ఉంది. ప్రస్తుతం ఆర్తి ఏడు నెలల గర్భిణీగా ఉంది. ఇంటి బాల్కనీలో పాప ఏడుస్తూ కనిపించడంతో ఇరుగుపొరుగు వారు పోలీసులు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడి చేరుకొని తలుపు తట్టినా తీయకపోవడంతో బద్దలు కొట్టారు. బెడ్ రూమ్ లోకి వెళ్లి చూడగా దంపతులు రక్తపు మడుగులో కనిపించారు. కత్తులతో పొడిచి చంపినట్టు పోలీసులు గుర్తించారు. భార్యను భర్త కత్తితో పొడిచి హత్య చేసిన అనంతరం భర్త పొడుచుకొని ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. శవ పరీక్ష నివేదిక వచ్చిన తరువాత అని విషయాలు చెబుతామని పోలీసులు పేర్కొన్నారు. వెంటనే పోలీసులు మహారాష్ట్రలో ఉన్న వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. కొడుకు, కోడలు అన్యోన్యంగా ఉండేవారని, వారి మధ్య ఎటువంటి గొడవలు లేవని వారి కుటుంబ సభ్యులు తెలిపారు. చిన్నారిని మృతుడి స్నేహితుడికి అప్పగించారు. వారి మృతదేహాలు భారత్ కు రావడానికి పది రోజులు పట్టే అవకాశం ఉందని అక్కడి అధికారులు తెలిపారు. న్యూజెర్సీ జనాభాలో 60 శాతం మంది భారతీయులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News