Monday, April 29, 2024

బిజెపి నేతలు వీధి రౌడీల్లా మాట్లాడుతున్నారు: జగదీష్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

 

నల్లగొండ: బిజెపి నేతలు వీధి రౌడీల్లా మాట్లాడుతున్నారని మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నికల సందర్భంగా నిడమనూరు మండలంలోని పలు గ్రామాల్లో టిఆర్‌ఎస్ నేతలు ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నాగార్జున సాగర్ ఎన్నికల్లో బిజెపికి డిపాజిట్ కూడా రాదన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజలను కాంగ్రెస్ నేత మాజీ మంత్రి జానారెడ్డి పట్టించుకోలేదన్నారు. ప్రైవేట్ ఉపాధ్యాయులకు ఆర్థిక సాయం చేసిన ఘనత సిఎం కెసిఆర్‌కే దక్కుతుందన్నారు. నోముల భగత్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి జగదీష్ రెడ్డి, ఎంపి లింగయ్య యాదవ్, ఎంఎల్‌సి పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎంఎల్‌ఎలు భాస్కర్ రావు, బొల్లం మల్లయ్య యాదవ్, అభ్యర్థి నోముల భగత్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News