Tuesday, April 30, 2024

తెలంగాణ విత్తన దృవీకరణ సంస్థకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు….

- Advertisement -
- Advertisement -

తెలంగాణ విత్తన దృవీకరణ సంస్థ విత్తన పరీక్ష ల్యాబ్ కు అత్యున్నత స్థాయి అంతర్జాతీయ గుర్తింపు

తెలంగాణ విత్తన రంగ పురోగమనంలో మరో మైలు రాయి

అభినందించిన మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

International Seed Recognition for Telangana Seed Certification Authority

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో తెలంగాణ ప్రభుత్వ సహకారంతో అంతర్జాతీయ హంగులతో “తెలంగాణ అంతర్జాతీయ విత్తన పరీక్ష కేంద్రం” పేరుతో విత్తన పరీక్ష ప్రయోగశాల రాష్ట్ర విత్తన దృవీకరణ సంస్థ నిర్మించింది.  పంటల దిగుబడి & వ్యవసాయ ఉత్పత్తిని పెంచటంలో నాణ్యమైన విత్తనం అనేది కీలక పాత్ర పోషిస్తుందన్నారు.   ఈ నేపథ్యంలో, విత్తనం నాణ్యమైనదా కాదా అని నిర్ధారించి, రైతులను నాసిరకం విత్తనాల బెడద నుంచి కాపాడడానికి విత్తన పరీక్ష అనేది అత్యంత ముఖ్య ఘట్టమన్నారు. ఈ విధంగా విత్తన పరీక్ష అనేది శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం తో కూడిన ఒక ప్రత్యేకమైన ప్రక్రియ కొనియాడారు.

తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రతి ఏటా విత్తన ఎగుమతులు పెరుగుతుండటం దృష్ట్యా, విత్తన ఎగుమతికి సంబందించి అన్నీ పరీక్షలు చేసి విత్తనోత్పత్తి దారులకు సేవలు అందించడానికి వీలుగా, తెలంగాణ ప్రభుత్వం దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అంతర్జాతీయ ప్రమాణాలతో, అధునాతన విత్తన పరీక్షా యంత్రాలను సమకూర్చి ఏడు కోట్ల వ్యయంతో ఇస్టా విత్తన పరీక్ష ల్యాబ్ ను నిర్మించడం జరిగింది.

గడిచిన నాలుగు సంవత్సరాలుగా ల్యాబ్ నిర్మాణం చేపట్టి, అధునాతన విత్తన పరీక్ష ప్రమాణాలను ఏర్పాటు చేసిన విత్తన దృవీకరణ సంస్థగా పేరుగాంచింది.  అంతర్జాతీయ విత్తన పరీక్ష ప్రమాణాలు సంస్థ, స్విట్జర్లాండ్ గుర్తింపు కొరకు దరఖాస్తు చేసుకోగా, గత సంవత్సరం అక్టోబర్ నెలలో ఆడిటింగ్ లో భాగంగా అన్ని రకాల పరీక్షలు & విశ్లేషణలు నిర్వహించిన ఆడిటింగ్ టీమ్, అనంతరం ఫిబ్రవరి 9, 2022 న గుర్తింపు ఇస్తున్నట్లు ఇస్టా సెక్రటేరియల్, స్విట్జర్లాండ్ వారు ప్రకటించడం జరిగింది.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగంలో 130 & ప్రైవేట్ రంగంలో 50 నోటిఫైడ్ విత్తన పరీక్ష ల్యాబ్ లు ఉన్నాయి. కానీ ఇందులో కేవలం 26 ల్యాబ్ లు ఐఎస్ టిఎలో భాగస్వామ్య ల్యాబ్ లు ఉండగా అందులో 8 ల్యాబులు మాత్రమే ఐఎస్ టిఎ గుర్తింపును పొందాయి. ఈ విధంగా, దేశంలో ఐఎస్ టిఎ గుర్తింపును పొందిన రెండవ ప్రభుత్వ రంగ ల్యాబ్ గా తెలంగాణ విత్తన పరీక్ష ల్యాబ్ పేరొందింది.

తెలంగాణ రాష్ట్రం నుంచి మరిన్ని విత్తన ఎగుమతులు ప్రోత్సహించి, విత్తన రంగ అభివృద్దిని & విత్తన వాణిజ్యాన్ని మరింత పెంపొందించి, ప్రపంచ విత్తన పటంలో తెలంగాణ రాష్ట్రం అగ్ర భాగానా నిలవటానికి ఇది ఎంతగానో దోహదపడనున్నది. ఈ అంతర్జాతీయ విత్తన పరీక్ష ల్యాబ్ మరి కొద్ది రోజుల్లోనే ప్రారంభం అయ్యి అందుబాటులోకి రానున్నది.

ఒక్కసారి ఈ ల్యాబ్ తెలంగాణలో వాడుకలోకి వస్తే అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా విత్తన మొలకశాతం, తేమ శాతం, భౌతిక స్వచ్ఛత, జన్యు స్వచ్ఛత లాంటి నాణ్యతా పరీక్షలతో పాటు సింగల్ విండో పద్దతిన విత్తన ఎగుమతి కి సంబందించిన అన్నీ రకాల విత్తన ఆరోగ్య పరీక్షలు, జన్యు పరీక్షలు చేయడం జరుగుతుంది.

ప్రపంచ దేశాలలో విత్తన శాస్త్ర సాంకేతిక రంగాలలో పరిశోధనలు జరిపి విత్తన పరీక్ష పద్దతులు, ప్రమాణాలను రూపొందించే అంతర్జాతీయ స్థాయి సంస్థ గుర్తింపు తెలంగాణ విత్తన ల్యాబ్ కు రావటం ఎంతో సంతోషంగా ఉంది, ఇందుకు అన్ని రకాల సహాయ సహకారాలు అందించిన తెలంగాణ ప్రభుత్వానికి ప్రత్యేక కృతగ్నతలు – డా. కేశవులు విత్తన దృవీకరణ సంస్థ సంచాలకులు

గౌరవ ముఖ్యమంత్రి ఆశయం ప్రకారం తెలంగాణను ప్రపంచ విత్తన భాండాగారం తీర్చిదిద్దటానికి, ఇలాంటి అంతర్జాతియ స్థాయి గుర్తింపు ఎంతగానో దోహదపడుతుందని డా. కేశవులు తెలిపారు.

వ్యవసాయ & విత్తన రంగ అభివృద్ధ్యే లక్ష్యంగా గత సంత్సరం నవంబర్ లో విత్తన పరిశ్రమల సమగ్ర అభివృద్దిపై “అంతర్జాతీయ విత్తన సదస్సు” లో తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ విత్తన భాండాగారంగా గుర్తించిన ఐక్యరాజ్య సమితి – అంతర్జాతీయ ఆహార సంస్థగా గుర్తించారు.  తెలంగాణ విత్తన దృవీకరణ సంస్థ అంతర్జాతీయ స్థాయి సంస్థలైన ఐఎస్ టిఎ, ఒఇసిడి, ఐఎస్ ఎఫ్, యుపిఒవి, ఎఫ్ఎఒ సంబంధాలు మెరుగుపరచుకొని విత్తన రైతులకు, విత్తనోత్పత్తి దారులకు అంతర్జాతీయ విత్తన ప్రముఖులచే నాణ్యమైన విత్తనోత్పత్తి, అంతర్జాతీయ విత్తన దృవీకరన, విత్తన నమూనాలా సేకరణ, విత్తన పరీక్ష పద్దతులపై పలు వర్క్ షాప్ లు, శిక్షణ కార్యక్రమాలు, నిర్వహిస్తూ రాష్ట్ర విత్తన రంగమే కాకుండా, దేశ విత్తన రంగ అభివృద్దికి కూడా తోడ్పాటు అందించడం జరుగుతున్నది. రాష్ట్ర విత్తనాభివృద్ది సంస్థను రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అభినందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News