Wednesday, May 1, 2024

పటేల్ విగ్రహాన్ని సందర్శించిన కొప్పుల

- Advertisement -
- Advertisement -

గాంధీనగర్:  గుజరాత్ రాష్ట్రంలోని నర్మదా వ్యాలీలో నెలకొల్పిన భారత తొలి ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సందర్శించారు. 597 అడుగుల ఎత్తు ఉన్న ఈ కాంస్య విగ్రహం, ప్రపంచంలోని విగ్రహాలన్నింటిలో అతి పెద్దది అనే విషయం తెలిసిందే. నర్మదా నది లోయలోని కేవాడియా వద్ద సాధూబెట్ అనే చిన్న దీవిలో 2 వేల కోట్లకు పైగా ఖర్చు చేసి ఈ విగ్రహాన్ని నెలకొల్పారు. హైదరాబాద్ నగరం నడిబొడ్డున హుస్సేన్ సాగర్ తీరాన దేశంలో మరెక్కడా కూడా లేనివిధంగా రాజ్యాంగ నిర్మాత, మహనీయులు భారత రత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ విగ్రహాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠించనున్న విషయం విదితమే.

అంబేడ్కర్ 125 అడుగుల (పీఠంతో కలిపి 175అడుగులు ) విగ్రహం నిర్మాణం ఏర్పాట్లు వేగవంతంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ సంబంధిత శాఖ అధికారులను తన వెంట తీసుకుని మంగళ, బుధవారాలు ఢిల్లీ పరిసరాలలో ఉన్న పలు విగ్రహాల తయారీ స్టూడియోలను సందర్శించారు. అలాగే, నేడు కేవాడియా చేరుకుని సర్దార్ పటేల్ విగ్రహాన్ని సందర్శించారు. పటేల్ జీవితచరిత్రకు సంబంధించిన ఫోటో గ్యాలరీ, ప్రదర్శన శాల, లేజర్ షోలను మంత్రి తిలకించారు. ఈ సందర్భంగా విగ్రహ ప్రతిష్టాపన, అందుకు సంబంధించిన విశేషాలను అక్కడి అధికారులు మంత్రి కొప్పులకు వివరించారు. విగ్రహ నిర్వహణ, అక్కడి పరిసరాలు, పరిశుభ్రత, సుందరీకరణను మంత్రి నిశితంగా పరిశీలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News