Tuesday, April 30, 2024

షూటింగ్‌లో మరో స్వర్ణం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: రాజధాని ఢిల్లీలో జరుగుతున్న ఐఎస్‌ఎస్‌ఎఫ్ ప్రపంచ కప్ షూటింగ్ పోటీల్లో భారత్‌కు మరో స్వర్ణం లభించింది. గురువారం జరిగిన మహిళల 25 మీటర్ల పిస్టోల్ టీమ్ విభాగంలో భారత్ పసిడి పతకం సొంతం చేసుకుంది. చింకి యాదవ్, రాహి సర్నోబత్, మనూ బాకర్‌లతో కూడిన భారత జట్టు 177 తేడాతో పోలండ్‌ను ఓడించి స్వర్ణం గెలుచుకుది. సమష్టిగా రాణించిన భారత షూటర్లు అద్భుత ఆటతో దేశానికి మరో పసిడి పతకం సాధించి పెట్టారు. ఇప్పటికే మహిళల వ్యక్తిగత విభాగంలో చింకి యాదవ్ స్వర్ణం గెలుచుకున్న విషయం తెలిసిందే. అంతేగాక భారత్‌కే చెందిన రాహి సర్నోబత్, మనూ బాకర్‌లు రజత, కాంస్య పతకాలు గెలుచుకున్నారు. పురుషుల 25 మీటర్ల పిస్టోల్ వ్యక్తిగత విభాగంలో భారత్‌కు చెందిన తోమర్ పసిడి పతకం సాధించాడు. ఇదిలావుండగా పురుషుల 25 మీటర్ల టీమ్ విభాగంలో భారత జట్టు ఫైనల్‌కు చేరి రజత పతకాన్ని ఖాయం చేసుకుంది.

ISSF World Cup: India Wins Gold in Shooting

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News